నిజాంపేట,జూలై21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహలకు చెక్ పడిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం నిజాంపేట మండలానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ ప్రజల పాలిట శాపంగా మారిందని అన్నారు.
నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నదని ప్రభుత్వం కల్పించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నూతనంగా ఏర్పడిన నిజాంపేట మండల అభివృద్ధికి తన వంతుగా నిధులను మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షలతో ఇండ్లను నిర్మిస్తామని, ఆగస్టు నెలలో పింఛన్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సర్పంచులు అనూష, చంద్రవర్ధిని ,అరుణ్కుమార్ ,అమరసేనారెడ్డి, నర్సింహారెడ్డి, తదితరులు ఉన్నారు.