తాడ్వాయి, జూలై 23 : అనారోగ్యంతో సమ్మక్క ఆలయ పూజారి సిద్ధబోయిన పాపారావు (60) గురువారం మధ్యాహ్నం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పలు దవాఖానల్లో చికిత్స పొందారు.
మధ్యాహ్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో ఇంటి వద్దనే మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాపారావు భౌతికకాయానికి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావుతోపాటు పలువురు నివాళులర్పించారు.