రాంచీ, సెప్టెంబర్ 17: లంచం కేసులో ఒక రైల్వే ఉద్యోగికి కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు 31 ఏండ్ల విచారణ తర్వాత తీర్పు చెప్పింది. కాళీ శంకర్ ధోబీ రాంచీలోచి హతియా రైల్వేస్టేషన్లో పార్సిల్ క్లర్క్గా పనిచేసేవాడు. 1995లో ఒక బైక్ను బీహార్లోని సమస్తిపూర్కు పంపాలని కోరిన నిర్మల్ కుమార్ బెగానీ అనే వ్యక్తి నుంచి రూ.100 లంచం డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా కాళీ శంకర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కేసును విచారించిన ట్రయల్ కోర్టు ఒక సెక్షన్ కింద ఒక ఏడాది, మరో సెక్షన్ కింద ఏడాదిన్నర జైలు శిక్షలు విధిస్తూ రెండూ ఏకకాలంలో అనుభవించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో రైల్వే శాఖ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ట్రయల్ కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, 31 ఏండ్ల విచారణ తర్వాత హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే కాళీ శంకర్ 75 ఏండ్ల వయసును దృష్టిలో పెట్టుకుని అతడి మొత్తం శిక్షను ఏడాదికి తగ్గించింది.