హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్-2026 మొదటి విడత సీట్ల కేటాయింపును కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి గురువారం విడుదల చేశారు. కన్వీనర్ సీట్లు 47,237 కాగా.. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు 23,122 మంది. వీరిలో మొదటి విడతలో 17,586 మంది సీట్లు పొందినట్టు తెలిపారు.
సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించాలని, రసీదు డౌన్లోడ్ చేసుకొని https://www.cpgetadmissions.com, https://www.cpgetadmissions.com ద్వారా ఈ నెల 21లోగా కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్ పూర్తిచేయాలని సూచించారు. కాలేజీలో ఒరిజినల్ టీసీ మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని, ఎస్సెస్సీ, డిగ్రీ మెమోలతోపాటు కులం, ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికేట్లను కేవలం ఫిజికల్ వెరిఫికేషన్ కోసం మాత్రమే ఒరిజినల్ పరిశీలిస్తారని స్పష్టంచేశారు.