Farooq Hussain | తొగుట, సెప్టెంబర్ 28 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డితో కలిసి నిరుపేదలకు దోతీ, అంగీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కరువు, కాటకాలతో ఈ ప్రాంతం అల్లాడిపోయిందని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాగునీరు, కరెంటు, అభివృద్ధి, సంక్షేమంలో మార్పు రావడం జరిగిందన్నారు. సాధారణ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మోసం చేయడం జరిగిందన్నారు.
దసరా పండుగ సందర్భంగా పేదవారికి దోతి, అంగీలను పంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. తనకు పదవులపై ఆశ లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డబ్బికారి పెంటోజీ, బండారు స్వామిగౌడ్, పిట్ల వెంకటయ్య, గంగొళ్ల రాజు, ఈదుగల్ల పర్శరాములు, కంకణాల స్వామి, పులిగారి లక్ష్మణ్, తర్గం నర్సింహ్మారెడ్డి, జహంగీర్, రాంబాబు, నవీన్ తదితరులు ఉన్నారు.
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం