జగదేవ్పూర్ మార్చి 25: మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఆదివారం బీఆర్ఎస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నర్సింహారెడ్డి, కొండపోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్రెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవరెడ్డి ఆయనకు పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ను మండలంలో బలోపేతం చేసి ఎన్నికల్లో ఎంపీ గెలుపునకు కృషి చేస్తామని వారు తెలిపారు.