మిరుదొడ్డి, అక్టోబర్ 18 : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆటో డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మానే మహేశ్ (31) వ్యవసాయంతో పాటు ఆటో నడుపుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
నిత్యం గొడువలు జరుగడంతో మన స్థాపానికి గురైన మానే మహేశ్ ఇంటిలో ఎవరు లేని సమయంలో సోమవారం తన ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు భూంపల్లి ట్రైనీ ఎస్ఐ జలాంధర్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ఏరియా దవాఖానకు తరలించారు.