హుస్నాబాద్: రాష్ట్రంలో అంటరానితనం, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించా రని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎండీ అన్వర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మీ, జడ్పీటీసీ భూక్య మంగ, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు.
దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధును ప్రవేశపెడితే దీనిపై విమర్శలు చేయడం ప్రతిపక్షనాయకుల ఓర్వలేనితనానికి నిదర్శనమన్నారు. ఒకవైపు దళిత బంధు పథకం ప్రారంభోత్సవం జరుగుతుంటే హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయ కులు దళిత దండోరా అంటూ నిరసన కార్యక్రమాలు చేయడం దళితులపై వారికి ఉన్న దురభిప్రాయాన్ని తెలియజేస్తు న్నదని విమర్శించారు. హుస్నాబాద్లో జరుగుతున్న అభివృద్ధి, దళిత బంధు పథకం అమలుతో తమ ఉనికిని కోల్పోతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలకు పాల్పడుతున్నారన్నారు.
ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ స్థానికుడు కాదని బొమ్మ శ్రీరామ్చక్రవర్తి అనడం విడ్డూరంగా ఉందని, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చే వాడో గుర్తు చేసుకోవాలన్నారు. కోహెడ, హుస్నాబాద్లో సొంత ఇండ్లు, స్థలాలు కలిగిన ఎమ్మెల్యేను స్థానికుడు కాదనడం వారి అవి వేకానికి నిదర్శనమన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసి తులను రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేయించి పనులను అడ్డుకునేలా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఎమ్మెల్యే సతీశ్కుమార్ నేతృత్వంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు రాబోతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శలే పనిగా పెట్టుకోవడం మానేసి అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, నాయకులు బీలూనాయక్, ఆకుల వెంకట్, చిట్టి గోపాల్రెడ్డి, పూదరి రవీందర్, బొజ్జ హరీశ్, గోవిందు రవి, బోజు రవీందర్, గోనెల మధుకర్, ఎండీ అయూబ్, లక్ష్మణ్నాయక్ పాల్గొన్నారు.