Congress Party leaders | నర్సాపూర్ : నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీలో జూనియర్ వర్సెస్ సీనియర్ లుకలుకలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గ్రామ పార్టీ అధ్యక్షుడిపై కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు కేసు పెట్టి అరెస్టు చేయించడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన జి మధు గౌడ్ ను నూతనంగా కాంగ్రెస్లోకి వచ్చిన కార్యకర్తలు అక్రమంగా అరెస్టు చేయించారని వెల్లడించారు.
ఈ సందర్భంగా మధు గౌడ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో తన ఫొటోను వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ మండల అధ్యక్షుడి దృష్టికి తీసుకుపోగా గ్రామానికి చెందిన కొందరు నూతనంగా పార్టీలోకి వచ్చిన నాయకులు ఫ్లెక్సీని చింపేశానని అక్రమంగా కేసు పెట్టడం జరిగిందని వెల్లడించారు.
పోలీసులు తనని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లకుండా గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఫ్లెక్సీ ఎందుకు చింపావని.. వారి దగ్గర ఆధారాలు ఉన్నాయని అడిగారని తెలిపారు. ఆ తర్వాత రాత్రి 8:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రాత్రి 12 గంటలకు వదిలిపెట్టడం జరిగిందన్నారు.
15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తను ఫ్లెక్సీని ఎందుకు చింపుతానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మీదట కాంగ్రెస్ సీనియర్ నాయకులపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలని కాంగ్రెస్ నియోజకవర్గ, రాష్ట్ర నాయకులను కోరారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!