గుమ్మడిదల, అక్టోబర్8 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బొంతపల్లి పంచాయతీ పరిధిలోని వీరభద్రనగర్ కాలనీలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గూడెం ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవాడలో పరిశ్రమలు అభివృద్ధికి సహకరిస్తున్నాయని అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణ, జడ్పీటీసీ కుమార్గౌడ్, సర్పంచ్ ఆలేటి నవీన, ఉపసర్పంచ్ సంజీవరెడ్డి, ఎంపీటీసీ నాగేందర్గౌడ్, దోమడుగు సర్పంచ్ రాజశేఖర్, వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హుస్సేన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, నాయకులు వినోద్గౌడ్, గ్రామకమిటీ అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.