చండీగఢ్ : ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా హర్యానా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 30 లక్షల వరకూ ఎక్స్ షోరూమ్ ధర కలిగిన ప్యూర్ ఎలక్ట్రిక్ లేదా బ్యాటరీతో నడిచే ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల కొత్త రిజిస్ట్రేషన్పై వందశాతం మోటార్ వెహికిల్ పన్ను మినహాయింపును ఆమోదించింది.
మహిళల పేరిట కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకునే నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అదనంగా ఒక శాతం రాయితీని మంత్రివర్గం ఆమోదించింది.