న్యూఢిల్లీ : జనన, మరణ నమోదు (సవరణ) బిల్లును బుధవారం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. జనన, మరణాల నమోదు రెండేండ్లు ఆలస్యమైతే కోర్టు అనుమతి తప్పనిసరి చేసింది. సంఘటన జరిగిన రెండేండ్ల తర్వాత నమోదయ్యే జనన, మరణాల నమోదుకు ముందు న్యాయపరమైన పరిశీలన, ఆమోదం అవసరమయ్యేలా సవరణలు చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: నీట్ రీఎగ్జామినేషన్కు సంబంధించి మరో సంగతి వెలుగుచూసింది. నీట్ ఫలితాల్ని విడుదల చేసిన ఎన్టీఏ పోర్టల్లో తనకు లభించిన మార్కులు మూడుసార్లు మారిపోయాయని ఓ అభ్యర్థి బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 24 గంటల వ్యవధిలో తన మార్కులు 650 నుంచి 135కు పడిపోయాయని అభ్యర్థి ఆరోపిస్తున్నాడు. పరీక్షల నిర్వహణకు సంబంధించి నందన్ నీలేకని నేతృత్వంలో ఒక కమిటీ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ఉదంతం బయటకువచ్చింది.