అందోల్ : పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం అందోల్లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వార్డు కమిటీల సభ్యులు, నియోజకవర్గంలోని పలు మండలాల నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తప్ప మరో పార్టీకి చోటులేదన్నారు. పార్టీ శ్రేణులు సమిష్టిగా పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూనే..ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు. ఎన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నా విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాదానం చెప్పాలన్నారు.
గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయివరకు పార్టీ శ్రేణులు సమన్వయమంతో పనిచేయాలన్నారు. పార్టీలతో సబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని ప్రజలకు గర్వంగా చెప్పాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, నాయకులు నాగరత్నంగౌడ్, షకీల్, సంతు, గోపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం..తెలంగాణ స్టేట్ మైనార్టీ కార్పోరేషన్ ద్వారా మంజూరైన వాహనాన్ని బుధవారం క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుడికి ఎమ్మెల్యే అందజేశారు. వట్పల్లి మండలం పోతులబొగుడ గ్రామానికి చెందిన మజార్కు కారు మంజూరు కాగా అతడికి దానిని ఎమ్మెల్యే అందజేశారు.