సంగారెడ్డి : సంగారెడ్డి కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల సహాయానికి (compensation ) కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చింది. జిల్లాలోని హత్నర మండలం చందాపూర్ గ్రామ శివారులోని కెమికల్ పరిశ్రమలో(Chemical Industries) రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా మరో 16 మందికి గాయాలయ్యాయి.
బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodara Rajanarasimha) గురువారం కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షలు నష్టపరిహారం అందించేందుకు కంపెనీ యాజమాన్యం సుముఖుత వ్యక్తం చేసింది. తక్షణసాయంగా దహన సంస్కారాల కోసం లక్ష రూపాయలను సంగారెడ్డిలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు అందజేశారు.