ఝరాసంగం, జూలై8 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పని చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ సొసైటీలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ఈ కేంద్రం పని చేస్తుందన్నారు.
గతంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవాలంటే జహీరాబాద్ మార్కెట్కు వెళ్లే వారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మండల స్థాయిలో ఉన్న సొసైటీ కేంద్రాల వద్దనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం, సొసైటీ చెర్మన్ గౌసొద్దీన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షడు బొగ్గుల జగదీశ్వర్, ఎంపీటీసీలు విజేందర్రెడ్డి, రాజు, మండల రైతు సమన్వనయ సమితి కన్వీనర్ సుభాష్రావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాచయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.