జిన్నారం, ఏప్రిల్ 2 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. గడ్డపోతారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఎమ్మెల్యే జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, డీఎస్పీ భీంరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన తపాలశాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామానికి చాలా లాభాలు ఉన్నాయన్నారు. నేరాలను అదుపు చేయడంతో పాటు రాత్రిపూట దొంగతనాలను నివారించవచ్చన్నారు. అలాగే వాహనాల రాకపోకలను గుర్తించవచ్చన్నారు. అసాంఘిక శక్తుల అరాచకాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యే వీడియో ఫుటేజీలతో ముఖ్యమైన కేసులను ఛేదించవచ్చన్నారు. పట్టణాలు, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పెరిగిందన్నారు. చాలా మంది ఇండ్లలో సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రకాశ్చారి, తహసీల్దార్ దశరథ్, సీఐ ప్రశాంత్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విధిగా మాస్కులు ధరించండి
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం పటాన్చెరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రజలు మాస్కులు ధరించాలన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో, మున్సిపాలిటీల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న ప్రజలు మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. వైరస్ కట్టడి ప్రధాన లక్ష్యం కావడంతో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం కొవిడ్ రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. గాంధీ దవాఖానలో రోగులకోసం ప్రత్యేక సేవలు ప్రారంభమయ్యాయన్నారు.
ఇవీ కూడా చదవండి..
రిపోర్టర్లను ఏప్రిల్ ఫూల్ చేసిన జిల్ బైడెన్
121 ఏండ్ల నాటి చాక్లెట్.. అటక మీద దొరికిందోచ్..!
భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి వద్దు.. జమ్ముకశ్మీర్తో లింకు పెట్టిన పాక్ క్యాబినెట్
మయన్మార్లో సైన్యం ఊచకోత.. 43 మంది చిన్నారులు మృతి