గుమ్మడిదల, మార్చి21 : సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెంలో రూ. 66 లక్షల సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
రూ.35 లక్షల హెటిరోడ్రగ్స్ పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్లకు శంకుస్థాపన, రూ.31లక్షల గ్రాన్యూవల్ ఇండియా పరిశ్రమ సీఎస్ఆర్ నిధులతో ఓహెచ్ఆర్ ట్యాంకు నిర్మాణానికి భూమి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో పారిశ్రామికవేత్తలు సీఎస్ఆర్ నిధులను వెచ్చించి గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పరిశ్రమ ముందుకు వచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సద్దిప్రవీణారెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, సర్పంచ్లు మమత, రాజశేఖర్, నర్సింహారెడ్డి, ఎంపీటీసీ నాగేందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.