నారాయణఖేడ్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే గిరిజనులకు సముచిత గౌరవం దక్కుతుందని నారాయణఖేడ్ మ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మాద్వార్ తండాలో భవానీమాత, సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి తమ తండాలకు గిరిజనులే ప్రతినిధులుగా కొనసాగే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. రూ.35 కోట్ల నిధులతో నియోజకవర్గంలోని 80 శాతం తండాలకు బీటీరోడ్డు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే మిగతా తండాలకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఆధ్యాత్మికంగా గిరిజనులు ఎంతో చైతన్యం సాధించారని, ప్రతి తండాలో భవానీమాత, సంత్సేవాల్ మహరాజ్ల ఆలయాలను నిర్మించడమే కాకుండా నిత్యం భక్తి మార్గాన్ని అనుసరించడం అభినందనీయమని కొనియాడారు.
కార్యక్రమంలో కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్, జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, బంజారా సేవాలాల్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షడు రమేశ్చౌహాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, తదితరులు పాల్గొన్నారు.