పటాన్చెరు: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన చిట్కుల్ గ్రామంలో జరిగింది. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కథనం ప్రకారం పటాన్చెరు మండలం చిట్కుల్లో నివసించే మేకవేల్ రాళ్లుకొట్టే పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడి భార్య రాజేశ్వరి తరచూ ఇతరులతో ఫోన్లో మాట్లాడుతన్నదనే అనుమానం పెంచుకున్న ఆయన నిత్యం భార్యతో గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలోఈ నెల 16న భార్యాభర్తలు ఇద్దరు తీవ్రస్థాయిలో గొడవ పడగా కుటుంబ సభ్యులు సర్ధిచెప్పారు. అయితే భార్యపై అనుమానం విపరీతంగా పెం చుకున్న మేకవేల్ బుధవారం రాళ్లు కొట్టే సుత్తితో భార్య తలపై కొట్టి పరారయ్యాడు కొన ఊపిరితో ఉన్న రాజేశ్వరిని కుటుంబ సభ్యులు పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మరణించి నట్టుగా డాక్టర్లు దృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.