పుల్కల్ రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుంది. రెండు రోజులుగా ఐదు గేట్లు రెండు మీటర్లు ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు వరద తీవ్రతను బట్టి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో ఎక్కువగా వస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
బుధవారం ప్రాజెక్టులో 27.148 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, క్రష్గేట్ల ద్వారా 62, 104 క్యూసెక్కులు, జెన్కో కు 2,121 క్యూసెక్కులు, కెనాల్స్ ద్వారా 140 క్యూసెక్కులు, హెచ్ఎమ్డబ్ల్యూఎస్ ద్వారా 80 క్యూసెక్కులు, ఎమ్ బి 70 క్యూసెక్కులు, ఈవీపీ లాస్ 300 క్యూసెక్కులు మొత్తంగా 64,815 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు వెల్లడించారు.