పటాన్చెరు, మే 27 : నిరుపేదల పాలిట సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు సంజీవనిలా ఆదుకుంటున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు రూ. 30.25లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ఫండ్స్ ద్వారా వందలాది మందికి మెరుగై చికిత్స అందుతుందన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రిలీఫ్ఫండ్స్ చెక్కుల జారీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించారని కొనియాడారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు సీఎం రిలీఫ్ఫండ్స్తో ఆదుకుంటున్నామన్నారు.
కార్పొరేట్ వైద్యానికి సీఎం రిలీఫ్ఫండ్ అండగా నిలుస్తున్నదన్నారు. ఎవరికి వైద్య చికిత్సకు ఇబ్బంది ఉన్నా తన క్యాంప్కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మండల పరిధిలోని 14 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను సైతం అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, ఎంపీపీలు దేవానంద్, ప్రవీణ విజయభాస్కర్రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, అమీన్పూర్ తహసీల్దార్ విజయ్కుమార్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, పరమేష్యాదవ్, రాజేష్, షేక్ హుస్సేన్, రవికుమార్, శ్రీను పాల్గొన్నారు.