MLA Gudem Mahipal Reddy | మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎల్లకొండ రాహుల్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీలోని 2వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ సార లావణ్యకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలలో ఇప్పటికే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.

Mallela Rajasri | బీఆర్ఎస్లో ఛైర్మన్ పదవి అనుభవించి కాంగ్రెస్లోకి జంప్.. బుద్ధిచెప్పిన ఓటర్లు
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్