Mallela Rajasri : బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఛైర్మన్ పదవి అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అయిన వ్యక్తికి ఓటర్లు బుద్ధిచెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీలో మల్లెల రాజశ్రీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. ఆ తర్వాత ఛైర్పర్సన్ పదవి దక్కింది.
బీఆర్ఎస్లో పదవి అనుభవించిన మల్లెల రాజశ్రీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా భీంగల్ మున్సిపాలిటీలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఓటర్లు ఆమెకు షాకిచ్చారు. ఆమెపై బీఆర్ఎస్ అభ్యర్థి రవి నీలం 75 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.