సంగారెడ్డి : హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న అదృశ్యమైన యువకుడి మృతదేహం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం బ్రిడ్జి వద్ద లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడిని హత్య చేసి దహనం చేసినట్లుగా తెలుస్తున్నది. మృతుడు కేపీహెచ్బీలో నివాసముండే నారాయణరెడ్డి (25) గా గుర్తించారు.
కాగా, సంవత్సరం క్రితం నారాయణరెడ్డి ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెండ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు, యువతిని తీసుకుని వెళ్లి హౌజ్ అరెస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.