మునిపల్లి,ఫ్రిబవరి 18 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశత్తు సింగూర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మునిపల్లి ఎస్సై మహేశ్వర్రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని శ్రీరాం కాలనీకి చెందిన కాశీనాథ్(33) తన వాహనాన్ని ప్రాజెక్టు అనకట్టపై నిలిపి ప్రమాదవశత్తు సింగూర్ ప్రాజెక్టులో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు కేతన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నాట్లు ఎస్సై తెలిపారు.