ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 6: దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఖమ్మంలోని తెలంగాణ భవన్లో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రొఫెసర్ విగ్రహానికి సండ్ర సహా బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ.. ప్రొఫెసర్ ఆశయ సాధనకు ప్రతి ఒకరమూ కృషి చేద్దామని అన్నారు. బీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు సహా పార్టీ నేతలు, ఉద్యమకారులు భాషబోయిన వీరన్న, కనగాల వెంకటరావు, ఖమర్, ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, బచ్చు విజయ్కుమార్, మక్బూల్, తోట రామారావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, ఆసిఫ్ పాల్గొన్నారు.