మనూరు, సెప్టెంబర్ 13 : మంజీరా నదిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని అతిమ్యాల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మనూరు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. అతిమ్యాల్ గ్రామానికి చెందిన తుకారం(33) మంజీరా నదిలో పడి ఆత్మహత్య చేసుకున్నడని తెలిపారు.
ఎన్జీహుక్రాన గ్రామ సమీపంలోని మంజీరాలో అతడి శవం లభ్యమైందన్నారు. కాగా, మృతుడికి భార్య మంజుల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.