జహీరాబాద్, ఆగస్టు 1 : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు తెలిపారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి ప్రమాణా స్వీకరోత్సవంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రైతుల ఉన్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, సాగుకు సరిపడా నీళ్లు, ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోళ్లు చేపడుతూ రైతును రాజు చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు భిక్షపతి, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, టీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.