పటాన్చెరు, జులై 7 : గాంధీజీ కలలు నిజం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలంలోని బచ్చుగూడెం, పోచారం, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, ఐనోలు, రామేశ్వరంబండ తదితర గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను, సీసీ రోడ్లు, బృహత్ పల్లె ప్రకృతివనాలు, స్ట్రీట్ లైట్స్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
బచ్చుగూడెంలో దళితబందు లబ్దిదారుని వ్యాపార సముదాయాన్ని ప్రారంభించి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. రామేశ్వరం బండలో టీఆర్ఎస్ నాయకుడు అంతిరెడ్డి సొంత నిధులతో నిర్మించిన వైకుంఠ రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఆయన సేవాభావాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేశామని, వర్షాకాలం రాకపోకలకు సమస్య రాకుండా హైలెవల్ బ్రిడ్జిలను నిర్మించామని గుర్తు చేశారు. సీఎస్సార్ నిధులతో అన్ని గ్రామాల్లో స్కూల్స్కి అదనపు గదులు నిర్మిస్తున్మాన్నారు.
బృహత్ పల్లె ప్రకృతివనాలు పల్లెలను వరంలా మారాయన్నారు. కాలుష్యకారక గ్రామాలకు పల్లెప్రకృతివనాలు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీ, జడ్పీటీసీ సుప్రజ, దళితబంధు అధికారి ప్రసాద్, ఎంపీడీవో బన్సీలాల్, సీనియర్ నాయకుల దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బీ పాండు, సర్పంచ్లు జగన్, మాజీ సర్పంచ్ భిక్షపతి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.