నారాయణఖేడ్/నాగల్గిద్ద: సీఎం కేసీఆర్ చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారా యణఖేడ్ మండలం నాగాపూర్లో రూ.16 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి ఆయన భూమిపూజ చేశారు. అదేవిధంగా పంచగామలో 10 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రక్రుతి వనం పనులను ప్రారంభించారు. నాగల్గిద్ద మండలం కారాముంగిలో బీసీ కమ్యూనిటీ హాల్, ఔదత్పూర్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఏస్గీలో పల్లె ప్రక్రుతి వనం, నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం, ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదని భావించి అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. డంప్ యార్డులు, వైకుంఠధామాలు నిర్మించడమే కాకుండా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ను పంపిణీ చేసి చెత్త సేకరణకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ కాలుష్యాన్ని అధిగమించేందుకు మొక్కల పెంపకాన్ని చేపట్టడమే కాకుండా చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ప్రతి గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల ఎంపీపీలు చాందీబాయి చౌహాన్, మోతీబాయి రాథోడ్, జడ్పీటీసీలు లక్ష్మీబాయి రవీందర్నాయక్, రాజు రాథోడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీ, నాగల్గిద్ద ఎంపీపీ ఉపాధ్యక్షుడు పండరియాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్తో పేదలకు సాయం
కల్హేర్: వైద్య చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక చేయూతనందిస్తుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. కల్హేర్ మండలం మాసాన్పల్లి గ్రామానికి చెందిన బేగరి భీమయ్యకు రూ.లక్షా 60వేలు, మార్డి గ్రామానికి చెందిన భాను ప్రసాద్కు రూ.13వేలు, కృష్ణాపూర్ గ్రామానికి చెందిన చంద్రకళకు రూ. 28వేలు, సిర్గాపూర్ మండలం అంతర్గావ్కు చెందిన మాల రాములుకు 32 వేలు, పెద్ద శంకరంపేట్ మండలం విరోజిపల్లికి చెందిన దుర్గయ్యకు రూ. లక్షా 50వేలు నిధులు మంజూరు కాగా గురువారం ఖానాపూర్ కేలోని నివాస గృహంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు.
కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంసింగ్, జడ్పీటీసీ నర్సింహరెడ్డి, సిర్గాపూర్ ఎంపీపీ మైపాల్రెడ్డి, శంకరంపేట్ ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ అలీ, కృష్ణాపూర్ సర్పంచ్ కిష్టారెడ్డి, అంతర్గావ్ సర్పంచ్ రవిందర్పాటిల్, పార్టీ మండలాధ్యక్షుడు నారాయణరావు, మార్డి పీఏసీఎస్ మాజీ చైర్మన్ జలంధర్, నాయకులు విఠల్రెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు.