అందోల్, సెప్టెంబర్ 21 : తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషితో అన్ని సర్కార్ దవఖానాల్లో ప్రజలకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
బుధవారం జోగిపేటలోని 100పడకల దవఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి రోగులకు అందుతున్న వైద్యం, ఇతర సదుపాయాలు, దవఖానా నిర్వహణ తదితర విషయాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని చెప్పారు. జబ్బుల బారిన పడి వైద్యంకోసం కార్పొరెట్ దవాఖానల చుట్టూ తిరిగి ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురికావొద్దనే అన్ని ప్రభుత్వ దవఖానాల్లో ఖర్చుకు వెనకాడకుండా నాణ్యమైన వైద్యం అందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ ఉన్నారు.