సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 22 : సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మున్సిపల్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.
మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ లత, కౌన్సిలర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మున్సిపాల్టీ అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు రణపడి ఉంటామన్నారు. మంత్రి హరీష్రావు సహకారం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ కృషితో నిధులు మంజూరు అయ్యాయని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వార్డుల వారీగా పర్యటించి చేపట్టాల్సిన పనులను పరిశీలిస్తామన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ను కలిసి సన్మానించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు వీణ, శ్రీకాంత్, నాని, రామప్ప, సాబేర్, సోహెల్, విష్ణువర్ధన్, జలేందర్రావు, రఫీక్, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, నాయకులు నక్క నాగరాజు, రషీద్ తదితరులు పాల్గొన్నారు.