బొల్లారం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహాకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన బీరప్ప, మల్లన్న దేవాలయాల నిర్మాణాలకు కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు పురాతన దేవాలయాల జీర్ణోద్ధారణ గావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి, కార్మిక నాయకులు వరప్రసాద్రెడ్డి, ప్రజాప్రతినిధులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.