ఝరాసంగం, సెప్టెంబర్28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాదేమోనన కలత చెంది ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బోరేగావ్ గ్రామంలో మంగళవార రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మృతుడు బేగారి బాల్రాజ్( 24)కు గత మూడు నెలల క్రితం జహీరాబాద్ మండల పరిధిలోని రంజోల్ గ్రామానికి చెందిన విజయతో విహహం జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులు వారి జీవితం సాఫీగా కొనసాగింది. కాగా, గత 15 రోజుల క్రితం భార్య ఆరోగ్యం బాగలేక పోవడంతో తల్లి గారి గ్రామానికి వెళ్లింది.
దీంతో భార్య కాపురానికి రాదేమనానీ మానస్థాపానికి గురై అదే గ్రామంలోని షేక్ మహబూబ్ సాబ్ వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని గ్రామస్తుల సహాయంతో మృతుడిని బావిలో నుంచి బాయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి అంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్ఐ తెలిపారు.