పటాన్చెరు, డిసెంబర్ 12: పటాన్చెరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న లయన్స్క్లబ్ భవనానికి పటాన్చెరు మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్రాజు రూ. 10లక్షల విరాళం అందజేశారు. ఆదివారం పటాన్చెరులో మాజీ జడ్పీటీసీ జైపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లయన్స్క్లబ్ నూతన భవనానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. దేవేందర్రాజు చెక్ను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ ముదిరాజ్, విరాళం అందజేసిన దేవేందర్రాజును అభినందించారు. నియోజకవర్గంలో ఎండీఆర్ ఫౌండేషన్ ద్వారా దేవేందర్రాజు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. నియోజకవర్గ ప్రజలతో పాటు, సంగారెడ్డి నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటున్నారని అభినందించారు. జైపాల్ ఆధ్వర్యంలో లయన్స్క్లబ్ సేవలు విస్తరించాయన్నారు. లయన్స్క్లబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు కొనియాడదగినవన్నారు. విద్యార్థులు, నిరుపేదలు, క్రీడాకారులకు అందజేస్తున్న సాయం గొప్పగా ఉందన్నారు. దేవేందర్రాజు మాట్లాడుతూ సమాజంలో సమస్యలను గుర్తించిచేతనైన స్థాయిలో వాటిని పరిష్కరించేందుకు అండగా ఉంటున్నామన్నారు. లయన్స్క్లబ్ విశిష్ట సేవలకు కేంద్రం అన్నారు. లయన్స్క్లబ్కు సొంత భవనం నిర్మాణమైతే స్థానికంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్యాదవ్, రవి పాల్గొన్నారు.