Gamblers | నర్సాపూర్, సెప్టెంబర్ 29 : నర్సాపూర్ ఎస్ఐగా నాలుగు రోజుల క్రితం చార్జ్ తీసుకున్న ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి పేకాట రాయుళ్ల శిబిరంపై మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తన టీంతో కలిసి పేకాట శిబిరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులోని అనన్య ఫామ్ హౌస్లో చట్ట విరుద్ధంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న కడిమేన వీరేశం, సోక్కంపేట పరమేశ్వర్, పెద్ద రామగౌని జగన్, బొట్టే యాదగిరి, కడలి కిరణ్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నాం. వీరి వద్ద నుండి రూ.3,800 నగదు, 104 ప్లేయింగ్ కార్డ్స్, షిఫ్ట్ కారు, రెండు బైకులు, 55 గేమింగ్ కాయిన్స్, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు.
వీరితోపాటు పేకాట ఆడుతున్న సంతోష్, విక్కీ కుమార్, శివ, పొన్నయ్య, పవన్ లు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. చట్ట విరుద్ధమైన పేకాట లాంటి ఆటలు ఆడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
Warangal | వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు బదిలీ
Chiranjeevi | టీమిండియాకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు.. తెలుగు తేజంపై ప్రశంసలు