Collector Rahulraj | మెదక్ రూరల్, అక్టోబర్ 30 : హవేలీ ఘన్పూర్ మండలం జక్కన్నపేట్ గ్రామంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా జక్కన్నపేట ఇంటర్మీడియట్ పంప్ స్టేషన్లో పనిచేయని మోటార్లను పరిశీలించారు. వెంటనే మరమ్మత్తులు చేసి సాధ్యమైనంత త్వరగా మిషన్ భగీరథ నీళ్లు 35 గ్రామాలకు పంపించాలని.. అప్పటివరకు తాత్కాలికంగా లోకల్ సోర్సెస్ ద్వారా అన్ని గ్రామాలలో మంచినీళ్లు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పెద్దిరెడ్డి పేట నుండి జక్కన్నపేట ఇంటర్మీడియట్ పంప్ హౌస్కు నీరు సరఫరా అవుతుందని, అక్కడినుండి 35 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందని, 75 హెచ్పీ మోటార్స్ రెండు కాలిపోవడం వల్ల గత వారం రోజుల నుండి నీటి సరఫరా నిలిచిపోయిందని.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో ఉన్న నీటి వనరుల నుండి సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మోటార్లు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
మోటార్ల మరమ్మత్తులకు సమయం పడుతున్న సందర్భంలో తాత్కాలిక మోటార్లు తెప్పించి, బిగించి రేపు మధ్యాహ్నం వరకు నీరు సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భవిష్యత్లో జిల్లాలో మిషన్ భగీరథ త్రాగునీరు ప్రజలకు సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టాండ్ బై మోటార్లు ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నికిత, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Hot Fish Curry: భార్య ముఖంపై వేడి చేపకూర చల్లిన భర్త
Quality Seeds | నాణ్యమైన విత్తనాలతో పంట దిగుబడి .. రైతులకు అవగాహన