MLA Raja Singh | పెద్ద శంకరంపేట్, ఫిబ్రవరి 22 : హైదరాబాద్ నుండి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు తరలివెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను 161 జాతీయ రహదారిపై పోలీసులు అడ్గుకున్నారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కింగ్స్ 9 రెస్టారెంట్ వద్ద మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తోపాటు పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే రాజాసింగ్ను అదుపులోకి తీసుకొని పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
బాన్సువాడలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి రాజాసింగ్ తరలివెళ్తుండగా మార్గమధ్యంలో పెద్ద శంకరంపేటలో పోలీసులు అరెస్టు చేసి ఇలా పోలీస్ స్టేషన్కు తరలించారు. అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం, రేగోడు ఎస్ఐలు ప్రవీణ్ రెడ్డి, శంకర్, పోచయ్య ఇతర పోలీసు ఇబ్బంది ఉన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన భజరంగ్ దళ్ నేతలు.. ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టారు. ఈ క్రమంలో పెద్ద శంకరంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Medak | మెదక్ జిల్లాలో దారుణం..భార్యను గొంతు కోసి హతమార్చి, నగలతో పరారైన భర్త
Modugapoolu | మోదుగు పువ్వులు విరబూస్తూ.. బాటసారులకు కనువిందు చేస్తూ
Rtc bus | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్కు గాయాలు