చేగుంట : అక్టోబర్17 : బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన కుంట మహేష్(22) గతంలో ఇద్దరు అక్కల పెళ్లిలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు తన వ్యవసాయ పోలం సమీపంలోని బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు.
మృతిడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని వెలికి తియించి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖాన తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇంచార్చి ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.