20ఏండ్లకు అనుగుణంగా మాస్టర్ప్లాన్
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, మే 5: దేశంలోనే మోడల్ ప్లాన్ సిటిగా మహబూబ్నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణం హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో మరింత సుందరంగా, ప్లాన్ సిటీగా తీర్చిదిద్దేందుకు వచ్చే 20ఏండ్లకు అవసరమైన మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే మోడల్ ప్లాన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణాన్ని జాతీయ రహదారులకు అనుసంధానిస్తూ రోడ్లు, కమర్షియల్ సెంటర్లు, రెసిడెన్షియల్ జోన్లు, ఇండస్ట్రీయల్ జోన్లు, బైపాస్ రోడ్డు ఏర్పాటుతోపాటు ప్లాన్సిటీగా తయారు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అర్వీ అసోసియేట్ అధికారులు, హెచ్వోడీ టీమ్ లీడర్ జీ.పాలనీ, అర్బన్ ప్లానర్లు శేఖర్గౌడ్, కే.ప్రత్యూష పాల్గొన్నారు.