సీసీసీ నస్పూర్, మే 11 : ఈ నెలలో నిర్వహించే శ్రీరాంపూర్ ఏరియాలోని ఐకే-1ఏ గని పబ్లిక్ హియరింగ్ను విజయవంతంగా పూర్తి చేయాలని జనరల్ మేనేజర్ సురేశ్ అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహణపై ఆయన మంగళవా రం సాయంత్రం సీసీసీ సింగరేణి అతిథి గృహంలో అధికారులతో సమీక్షించారు. పబ్లిక్ హియరింగ్ సమావేశం నిర్వహణ, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అన్ని విభాగాధిపతులకు కేటాయించిన పనులను పూర్తి చేసి సమావేశాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. పబ్లిక్ హియరింగ్ సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్వోటూజీఎం గుప్తా, ఏరియా ఇంజినీర్ కుమార్, ఇన్చార్జి ఎన్విరాన్మెంట్ అధికారి నూక రమేశ్, ఇందారం ఓసీపీ పీవో రాజేశ్వర్రెడ్డి, డీజీఎం పర్సనల్ గోవిందరాజు, ఐఈడీ డీజీఎం చిరంజీవులు, వర్క్షాప్ డీజీఎం వెంకటేశ్వర్రావు, డీవైసీఎంవో విజయలక్ష్మి, సివిల్ డీజీఎం శివరావు, సర్వే అధికారి రాఘవేంద్రరావు, సెక్యూరిటీ అధికారి మురళీమోహన్ పాల్గొన్నారు.