దండేపల్లి : దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టెం లింగన్న(62) అనే రైతు గురువారం విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్టెం లింగన్న రోజు మాదిరిగానే ఉదయం నెల్కివెంకటాపూర్ శివారులో పొలం పనులకు వెళ్లాడు.
వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్ పనిచేయకపోవడంతో మరమ్మతులు చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పండుగ పూట రైతు కరెంట్ షాక్తో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.