శ్రీరాంపూర్ : వారంలోగా ఉద్యోగులందరికీ రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పా, పీపీ) ఎన్ బలరాం అన్ని ఏరియాల జీఎంలకు ఆదేశించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్పై ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ 40,525 మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసి చాలా రోజులైందని గుర్తు చేశారు. ఇంకా మొదటి డోసు తీసుకోని 2695 మందికి వ్యాక్సినేషన్ త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు కేవలం 26,213 మంది కార్మికులు మాత్రమే రెండో డోసు పూర్తి చేశారని, మిగిలిన 14,312 మందికి వారం రోజుల్లోగా వ్యాక్సిన్ పూర్తి చేయాలని సూచించారు.
ఆస్పత్రుల్లో సౌకర్యాల పెంపుదలకు సీఅండ్ఎండీ శ్రీధర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఏరియాల జీఎంలు సంబంధిత వైద్య విభాగంతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. 90 శాతం మంది పొరుగు సేవల సిబ్బందికి మొదటి డోసు విజయవంతంగా పూర్తి చేయడంపై అభినందించారు. ఏరియా దవాఖానల్లో వసతులు పెంచడానికి వైద్య పరికరాల సమకూర్పు, వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది నియామకానికి కూడా యాజమాన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. పర్సనల్ విభాగం అధికారులు కార్మికుల సమస్యలను వినడానికి, వాటిని పరిష్కరించడానికి పూర్తి స్నేహ పూర్వ పద్ధతిలో వ్యవహరించాలని సూచించారు.
ఏరియాల వారీగా నిర్వహించిన గ్రీవెన్స్ డేలో వచ్చిన వినతులపై సత్వరమే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాథా శ్రీనివాస్, జీఎం (స్టాటెజిక్ ప్లానింగ్) సురేందర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ బాలకోటయ్య, ఎస్ఈ సంజీవరెడ్డి, కార్పొరేట్ నుంచి జీఎం సీపీపీ కే నాగభూషణ్రెడ్డి, ఎస్ఓటూ డైరెక్టర్ దేవికుమార్, శ్రీరాంపూర్ ఏరియా నుంచి జీఎం ఎం సురేశ్, ఎస్ఓటూజీఎం కే హరినారాయణగుప్తా, డీవైజీఎం గోవిందరాజు, డీవైసీఎంఓ డాక్టర్ రమేశ్బాబు, డాక్టర్ లోక్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.