అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా శ్రీశైలంలో దైవదర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైందని తెలుస్తున్నది. మృతులను, క్షతగాత్రులను గుంటూర్ జిల్లా వాసులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.