టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజశేఖర్, మండల అధ్యక్షుడు విజయ్కుమార్, ప్రధానకార్యదర్శి ప్రశాంత్ బాబు, ఉపాధ్యాయులు సురేశ్, కిరణ్కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.