కల్వకుర్తి, మే 5 : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఈనెల 8న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కల్వకుర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఏర్పాట్లును పరిశీలించారు. మినీ స్టేడియంలో హెలీప్యాడ్ స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్గౌడ్తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు మనోహర్రెడ్డి, ఆనంద్గౌడ్ తదితరులు ఉన్నారు.