వడ్డేపల్లి, మే 5 : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యా రెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అ మలు చేయడానికి నానా తంటాలు పడుతున్నదని, పరిపాలన చేతగాని ఈ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం శాంతినగర్లో రాజోళి, వడ్డేపల్లి మండలాల బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథులుగా అలంపూర్ ఎమ్మెల్యే తో కలిసి ఎమ్మెల్సీ చల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, గతంలో అమలులో ఉన్న రైతుబంధు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలను కూడా అమలు చేయడం లేదని ఆరోపించా రు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో కేవలం 4వేల చిలుకు ఓట్లు పడ్డాయని ఈసారి పెరిగితే మరో నాలుగువేల ఓట్లు పెరగవచ్చని, బీజేపీ మనకి పోటీ యే కాదని, కాంగ్రెస్ను నమ్మవద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో తాగునీరు, కరెంటు ఇబ్బందులు ఉండేవికావని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని, పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అనంతరం బీఎస్పీకి చెందిన యాభైమంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ రజితమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ కరుణ మ్మ, మాజీ జెడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు, వైస్ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, రాజోళి వైస్ఎంపీపీ రేణు క, సహకార సంఘం అధ్యక్షుడు గోపాల్రెడ్డి, రాజో ళి మండల పార్టీ అధ్యక్షుడు పచ్చర్ల శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శాంతినగర్లో నిర్వహించిన కార్యక్రమంలో వ డ్డేపల్లి, రాజోళి మండలాలకు చెందిన బీఎస్పీ నా యకులు ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు ఆ ధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వా రిలో బీఎస్పీ అలంపూర్ తాలూకా ప్రధాన కార్యద ర్శి రవిచందర్, బూత్కమిటీ అధ్యక్షులు, ముఖ్యకార్యకర్తలు లక్ష్మన్న, వెంకటేశ్, హనుమంతు, నర్స న్న, ఆదాం, రాజారావు తదితరులు ఉన్నారు.