Farmer | మాగనూరు, మార్చి 07: నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాగనూరు మండలం అచ్చంపేట గ్రామంలో ఓ యువరైతు కరెంటు షాక్తో మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట గ్రామానికి చెందిన యువ రైతు బచ్చి దేవప్ప (32) శుక్రవారం రాత్రి తమ పొలానికి వెళ్లాడు. మోటార్ స్టార్టర్లో కరెంటు ప్రాబ్లెం వస్తుండటంతో దాన్ని సరిచేయబోయి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే దేవప్ప ప్రాణాలు విడిచాడు. అయితే రాత్రి పొలానికి వెళ్లిన దేవప్ప.. ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. అనుమానంతో శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా.. దేవప్ప విగతజీవిగా కనిపించాడు. మృతుడు దేవప్పకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
దేవప్ప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న దేవప్ప కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.