నారాయణపేట : రేషన్ బియ్యం లారీ ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఘటన
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని రాకొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాకొండ నుంచి పూసలపాడు గ్రామానికి రేషన్ బియ్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి చెరువులో పడింది.
గమనించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ని సురక్షితంగా బయటకు తీశారు. రోడ్డు కుంగిపోవడం వల్లే లారీ చెరువులో పడిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.