మహబూబ్నగర్, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నారాయణపేట జిల్లా కొత్త సొ బగులు అద్దుకుంటున్నది. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, నూతనంగా చే పట్టనున్న పనులకు శంకుస్థాపనలు చేసేందుకు మంగళవారం మంత్రులు రానున్నారు. జిల్లా కేం ద్రం సమీపంలోని సింగారం చౌరస్తా వద్ద నిర్మించనున్న నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఇతర మంత్రులు మహమూద్అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతిరాథోడ్తో కలిసి శంకుస్థా పన చేయనున్నారు. అంతేకాక పేట నియోజకవర్గంలో రూ.181.42 కోట్లతో చేపట్లనున్న వివిధ అభివృద్ధి పనులకు కూడా మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
జిల్లాకు సరికొత్త హంగులు..
2018లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం కేసీఆర్ను నారాయణపేటను జిల్లాగా మార్చాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి రాగానే జిల్లాగా మారుస్తానని బహిరంగ సభలో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో నారాయణపేటను జిల్లాగా మారుస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ డివిజన్గా ఉన్న నారాయణపేట జిల్లాగా మారడంతో అందుబాటులో ఉన్న భవనాలను జిల్లా కార్యాలయాలకు కేటాయించారు. కలెక్టరేట్ను మాత్రం అద్దెకు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర శాఖలకు ఏర్పాటు చేసిన భవనాల్లో సరైన వసతులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తుండడంతో నారాయణపేటలో కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి కోరడంతో సీఎం కేసీఆర్ అంగీకరించారు. వెంటనే స్థలాలు పరిశీలించి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో మంగళవారం మంత్రులు కేటీఆర్, మహమూద్అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతిరాథోడ్ కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పట్టుబట్టి రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతుండడంతో నూతన హంగులు అద్దుకున్నది. జిల్లా స్వరూపమే మారిపోయింది. పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు కేటాయించడంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
మంత్రుల పర్యటన ఇలా..
ఉదయం 11 గంటలకు మంత్రులు కేటీఆర్, మహమూద్అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతిరాథోడ్ హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో నారాయణపేటకు చేరుకుంటారు.
హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డితో కలిసి మంత్రులు ముందుగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
సింగారం చౌరస్తా వద్ద రూ.62.10 కోట్లతో నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్కు, రూ.36.50 లక్షలతో నిర్మించనున్న ఎస్పీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు.
మిగతా అభివృద్ధి పనులకు కూడా అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాల వద్ద పూజలు చేస్తారు.
రూ.56 కోట్లతో అప్పక్పల్లి-కోయిల్కొండ డబుల్ రోడ్డు నిర్మాణం, ధన్వాడ తాసిల్దార్ కార్యాలయం, ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లు, సేవాలాల్ భవన్, మరికల్ మండల కాంప్లెక్స్లకు శంకుస్థాపన చేస్తారు.
అక్కడి నుంచి బయలుదేరి కొత్తగా ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను మంత్రులు ప్రారంభిస్తారు.
యాద్గిర్ రహదారిలో నిర్మించిన సఖీ కా ర్యాలయం, కొండారెడ్డిపల్లి మినీ ట్యాంకుబండ్, 8వ వార్డులో నిర్మించిన సీనియర్ సిటిజన్ పార్కును ప్రారంభిస్తారు.